మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని వెలసిన శ్రీ పానకాలస్వామిని, శ్రీలక్ష్మీనరసింహస్వామిని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఘాట్రోడ్డులో కొండపైకి చేరుకొని పానకాల స్వామికి ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీరాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, క్రికెట్ అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పానకాలరావు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.