తిరుపతి, సూర్య ప్రధాన ప్రతినిధి : నూతన అవిష్కర ణలతో ఏర్పాటవుతున్న కంపెనీల అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. శనివారం రేణిగుంటలోని స్టార్ట్ అప్ విల్లాజ్ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అక్కడ జరు గుతున్న నూతన ఆవిష్కరణల గురించి మంత్రి కి ప్రతినిధులు వివరించారు. శిక్షణ తీసుకొని వినూత్న అవిష్క రణలతో కంపెనీలు ఏర్పాటు చేసిన వారితో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. వినూత్న అవిష్కరణలతో కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పి స్తున్న యువ పారిశ్రామికవేత్తలను మంత్రి నారా లోకేష్ అభినందించారు. నూతన ఆవిష్కరణలకు దేశంలోనే అత్యు త్తమ వేదికగా ఏపీ మారిందని, దేశంలోనే 6 వ అత్యుత్తమ ఇన్నోవేషన్ సెంటర్ గా గుర్తింపు పొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఫిక్కీ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇది త్వరలోనే దేశంలో నెంబర్ 1 ఇన్నోవేషన్ సెంటర్ గా తయారవుతుందన్నారు.
అరటచెట్టు నార నుండి నూతన ఆవిష్కరణ : ఆర్గానిక్ షేవింగ్ బ్రష్, టూత్ బ్రష్,బాత్ బ్రష్, ఇతర వస్తువులు తయారు చేస్తున్న బోధా కంపెనీ సిఈఓ సౌజన్యను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉత్పత్తి పెద్ద ఎత్తున పెంచడానికి ఒక ఎకరం స్థలం కేటాయిస్తే నూతన ప్లాంట్ ప్రారంభిస్తామని సౌజన్య మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. భూమి కేటాయింపు, భవన నిర్మాణం అయ్యే సరికి 9 నెలలు పడుతుందని, సమయం వృధా కాకుండా స్టార్ అప్ విలేజ్ లో రెడీగా ఉన్న షెడ్లో అవకాశం కల్పిస్తామన్నారు. తక్షణం ఉత్పత్తి ప్రారంభించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, త్వరలో భూమి కూడా కేటాయిస్తామని మంత్రి నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు.