ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిపై పవన్ సంచలన డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 08:02 PM

అమరావతి కోసం ఆ ప్రాంత టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమరావతి కోసం టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు.వారికి చిత్తశుద్ది ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని జనసేనాని విమర్శలు గుప్పించారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ తాను చెబుతున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధానిపై ఆటలు మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa