నెల్లూరు, సూర్య ప్రధాన ప్రతినిధి : మద్యం బార్ లైసెన్సుల నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెలాఖరుకు లైసెన్సు గడువు ముగయ నుంది. దీంతో నెల్లూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి మార్గద ర్శకాలు విడుదలయ్యాయి. ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ కేటాయిస్తూ నిబంధనలు జారీ అయ్యాయి. దీంతో పాటు లైసెన్సు ఫీజు భారీగా తగ్గించే శారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఏడాదికి రూ. 8 లక్షలు రీఫండబుల్ అమౌంట్ను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తంతో పాటు రూ.2 లక్షల లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంది. 50 వేల నుంచి ఐదు లక్షలలోపున్న జనాభా ప్రాంతంలో నాన్ రీఫండబుల్ మొత్తం రూ.18 లక్షలు, ఐదు లక్షలపైనున్న ప్రాంతానికి రూ. 28 లక్షలు రీఫండబుల్ మొత్తంగా నిర్ణయించింది. వీటికి సైతం లైసెన్సు ఫీజును రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంది. నెల్లూరు ఎకై్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు బలరామకృష్ణ, విజయ, పలువురు ఎక్సైజ్ అధికారులు కొత్త మార్గదర్శకాలపై సమావేశమై చర్చించారు. కాగా గతంలో ఉన్న బార్ల లైసెన్సుదారులకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సేకరించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడైనా పాత బార్ నిర్వాహకుడు కొత్త లైసెన్సు అవసరంలేదని తెలియజేస్తేనే ఇతరులకు కేటాయించాలని ఆదేశిం చింది. వెంకటగిరి, ఆత్మకూరు, మరో రెండు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు మాత్రమే కొత్తవారి నుంచి పోటీ వచ్చే అవకాశం ఉంది. రెండు నెలల కిందట మద్యం దుకాణాలను లాటరీలో తీసుకున్న వారు జులై ఒకటినుంచి కొత్తదుకాణాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మాత్రం మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని ఎకై ్సజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది వ్యాపారులు వివిధ సిఫార్సులతో సుప్రీంకోర్టు నిబంధనలు అమలు లేకుండా చేసేందుకు రాష్టస్థ్రాయిలో కసరత్తు చేస్తున్నా దీనిపై ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 41 బార్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో కొత్త బీర్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు కొత్త పాలసీలో నిబంధనలు సడలించారు. వీటిపై పూర్తి స్థాయిలో వివరాలు జిల్లాకు అందలేదు. బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుద లైందని, దరఖాస్తులు తీసుకుంటామని నెల్లూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.