అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : పురపాలక శాఖలోని ప్రజారోగ్యం విభాగం ఇంజినీర్ ఇన్చీఫ్ డాక్టర్ పాము పాండురంగారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ బృందాలు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన నివాసాల్లో జరిపిన సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఆయన వద్ద భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తిం చారు. పట్టుబడిన ఆస్తులపై అసమగ్ర అభియోగపత్రం నమోదు చేశారు. నిన్న జరిపిన సోదాల్లోనే సుమారు రూ.500 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికా రులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాండురంగారావును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డీజీ ఠాగూర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రజారోగ్యశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు నివాసాల్లో రెండో రోజు ఏసీబీ అధికా రులు సోదాలు నిర్వహించారు. పాండురంగారావు భార్యపై పేరిట బోగస్ కంపెనీల రిజిస్టర్ చేయించారని ఏసీబీ అధికారులు తెలిపారు. భార్య రాజ్య లక్ష్మి పేరిట ఆదాయం చూపించేందుకు పాండురంగారావు షెల్ కంపెనీలను రిజిస్టర్ చేయించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖలో 2008లో సుధర్మ ఇన్ఫోటెక్ కంపెనీ, 2010లో హైదరాబాద్లో రాజ్యలక్ష్మి హైటెక్ వర్క్స, 2012లో హైదరాబాద్లో హెచ్ఎం టెక్నోక్రాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2013లో లక్ష్మి హనోరా డెవలపర్స్ పేరిట షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ కంపెనీల పేరిట భార్యకు ఆదాయం వస్తుందని పాండురంగారావు చూపించారని ఏసీబీ తెలిపింది. దర్యాప్తులో ఈ కంపెనీల్లో కార్యకలాపాలు జరగడం లేదని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. కేవలం షెల్ కంపెనీలే అని ఏసీబీ అధికారులు తేల్చేశారు.