ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల ఆరోగ్యానికి భరోసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 01:21 AM

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటు లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌ 7తో ముగి సిన పథకం గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వైద్య, ఆరోగ్యశాఖ పొడిగించింది. కొత్తగా తెల్లరేషన్‌ కార్డు దారులు ఈ పథకంలో చేరటానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయని 133 శస్తచ్రికిత్సలను ఆరోగ్య రక్ష పథకంలో చేరితే చేసేలా నిబంధనల్లో మార్పులు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు జిల్లాలో 37 ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు 13 ఉన్నా యి. వీటిలో వివిధ రోగాలకు శస్త్ర చికిత్సలు నిర్వహి స్తారు. ఆరోగ్య రక్ష పథకం రాకముందు తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం కింద ఉచితంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉండేది. ఏడాదికి గరిష్ఠంగా కుటుంబం మొత్తానికి కలిపి రూ. 2.50 లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించే వారు. దీంతో ఎక్కువ మంది తెల్లరేషన్‌ కార్డు పొందటానికి ప్రయత్నించారు. ప్రైవేటు వైద్య సేవలు ప్రియమయ్యాయి. తెల్లరేషన్‌ కార్డు లేని వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్య చేయించు కోవటం బాగా భారంగా మారింది. అనా రోగ్యం బారిన పడి వైద్యశాలకు వెళితే వెద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవటానికి రూ.వేలు నుంచి రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. మధ్య తరగతి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడితే అప్పులు చేసి ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లరేషన్‌ కార్డు లేని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా ఎవరైనా ఈ పథకంలో పేరు నమోదు చేయించుకుని ఏడాదికి రూ.1200 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల విలువెన వైద్య సేవలను ఉచితంగా పొంద టానికి అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా 1044 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవటానికి అవ కాశం ఉంది. వైద్యుని సిఫార్సు మేరకు అవసరమైన రోగు లకు ఏడాది పాటు ఉచితంగా మందులు అందజేస్తారు. ఆసుపత్రుల్లో ఏపీ సేవలు పొందటానికి, వెద్య పరీక్షలు చేయించు కోవటానికి అవకాశం కల్పించారు. తెల్లరేషన్‌ కార్డుదారులు పేర్ల నమోదుకు అవకాశం కల్పించలేదు. ఏప్రిల్‌ 7ను పేర్లు నమోదుకు తుది గడువుగా నిర్దేశించా రు. మీసేవా కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెద్య మిత్రల వద్దకు వెళ్లి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఇచ్చి రూ.1200 ప్రీమియం చెల్లించి పేరు నమోదుకు అవకాశం కల్పిం చారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లోను ప్రీమి యం సొమ్ము చెల్లించవచ్చు. గడువు ముగిసే నాటికి జిల్లా లో 8118 కుటుంబాలు, 17,314 మంది ఎన్టీఆర్‌ ఆరో గ్య రక్ష పథకం కింద లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. అయితే జిల్లాలో కనీసం రెండు లక్షల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. తెల్లరేషన్‌ కార్డుదారులు తమ పేర్ల నమోదుకు అవకాశం కల్పించి గడువును డిసెంబరు 31 వరకు పొడిగించారు. తెల్లరేషన్‌ కార్డుదారులు అదనంగా ప్రయోజనం పొందే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ కార్డు ద్వారా చేయలేని 133 రకాల శస్త్ర చికిత్సలు ఆరోగ్య రక్ష పథకం కింద చేయించుకునేలా చేశారు. ఈ కార్డుదారులు సైతం ఏడాదికి రూ.1200 ప్రీమియం చెల్లించి చేరితే 24 గంటల కడుపునొప్పి, నడుమునొప్పి, చెవిలో చీము కారటం తదితర ఆరోగ్య సమస్యలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. అయితే ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష పథకం గడువు పొడిగింపుపై పెద్దగా ప్రచారం చేయటం లేదు. దీని వల్ల ఎక్కువ మంది చేరలేదు. నిబంధనలు మార్చిన తర్వాత ఈ రెండు నెలలల కాలంలో కొత్తగా 347 కుటుంబాలు పథకంలో చేరాయి. పథకం కింద కుటుంబంలో ప్రతి సభ్యునికి ఏడాదికి రూ.2 లక్షల విలువెన వైద్య సేవలు లభిస్తాయి. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా వ్యక్తిగతంగా రూ.2 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. వైద్యులు, వ్యాపారులు, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు సైతం ఈ పథకంలో చేరుతున్నారు. ఆధార్‌ కార్డు నకలు ప్రతి తీసుకుని సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యమిత్ర వద్దకు వెళ్లి రూ.1200 చెల్లిస్తే వెంటనే ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేస్తారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. గడువు పొడిగించిన వెంటనే రూ.1200 ప్రీమియం చెల్లించి నేను పేరు నమోదు చేయించుకున్నా. వెద్య పరీక్షలు చేయించుకోవటం పాటు ఓపీ సేవలను ఉచితంగా పొందవచ్చు. సాధారణ రోగంతో ఆసుపత్రికి వెళితే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఖర్చవుతున్నాయి. అలాంటి సమయంలో ప్రీమియం సొమ్ము చెల్లించటం ప్రజలకు పెద్ద భారం కాదు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే పేరు నమోదు చేయించుకోవాలి. ఎన్టీఆర్‌ వైద్య సేవలో చేయలేని శస్త్ర చికిత్సలను ఆరోగ్య పథకం లబ్ధిదారులకు చేయటానికి అవకాశం ఉందని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు ఆశీర్వాదం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com