జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో అనేక విప్లవాత్మక మార్పులను పొందుపరిచిన విషయం కూడా విధితమే. అయితే పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయ శిక్షణ వంటి విషయాల్లో కూడా కొత్త విధానాలు అమల్లోకి తీసుకురానుంది. ఇకపై విధానాల రూపకల్పనకు మాత్రమే పాఠశాల విద్యాశాఖ పరిమితమవుతుంది. రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల ప్రామాణాల ప్రాధికారిక సంస్థ ఏర్పాటవుతుంది. ఇకపై పాఠశాలల పనితీరు ఆధారంగా అక్రిడేషన్ ఇవ్వనున్నారు. .నూతన విద్యావిధానం ఉపాధ్యాయులకు కూడా పలు వెసులుబాట్లు తీసుకొచ్చింది. బోధనేతర వ్యవహారాల కోసం వారిని వినియోగించకూడదని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా మిగతా విషయాల ఆధారంగా వారిని బదిలీ చేయకూడదని పేర్కొంది. టీచర్లకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. దీంతో వారు ఏటా కనీసం 50 గంటలపాటు వృత్తినైపుణ్య ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ప్రతి ఆవాస ప్రాంతంలో ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని కస్తూరి రంగన్ కమిటీ నివేదించింది. అయితే చాలా చోట్ల పాఠశాలల్లో తగినంత మంది స్టూడెంట్స్ లేరు. 2016-17 లెక్కల ప్రకారం ప్రైమరీ స్కూల్స్ లో ఒక్కో తరగతికి సగటున 14 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి చిన్న పాఠశాలలు నిర్వహించడం వల్ల ద్వారా ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి . అందుకే ఇలాంటి చిన్న, చిన్న పాఠశాలలను కలిపి ఒక చోట స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కొత్త విధానాన్ని సూచించింది.ఈ విధానంలో… ఒక్కో స్కూల్ కాంప్లెక్స్లో… ఒక మాధ్యమిక పాఠశాలతోపాటు, ప్రైమరీ స్కూల్స్ ఉండాలి. దీనికి 5-10 కిలోమీటర్లలో అంగన్వాడీలు ఉండాలి. ఈ విధానం వల్ల స్కూల్ కాంప్లెక్స్లో అన్ని సబ్జెక్ట్లకూ తగినంత మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. పాఠశాలల నియంత్రణలో విద్యాశాఖ జోక్యం చేసుకోకూడని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa