ఏపీలో గడిచిన 24 గంటల్లో 60, 794 నమూనాలను పరీక్షించగా 9, 276 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1, 47, 314కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 73, 719 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 72,188 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1407 మంది మృతి చెందారు.ఈ రోజు జిల్లాల వారీగా అనంతపూరంలో 1128, చిత్తూరు 949, ఈస్ట్ గోదావరి 876, గుంటూరు 1001, కడప 547, కృష్ణ 357, కర్నూల్ 1234, నెల్లూరు 559, ప్రకాశం 402, శ్రీకాకుళం 455, విశాఖపట్నం 1155, విజయనగరం 119, వెస్ట్ గోదావరి జిల్లాలో 494 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, విశాఖపట్నం 8, గుంటూరు 7, అనంతపూర్ 6, చిత్తూరు 6, కర్నూల్ 6, శ్రీకాకుళంలో 4, కృష్ణ 3, పశ్చిమగోదావరి 3, నెల్లూరు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కడప జిల్లాలో ఒక్కరు చనిపోయారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa