మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనేపధ్యంలో రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు రూ.1.5 లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనిర్ణయంతో 89 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.34 వేల కోట్ల భారం పడనుంది. కాగా రైతుల రుణాల మాఫీలకు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రావని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ తేల్చిచెప్పిన విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వాల నుంచే రైతుల రుణాలు మాఫీ చేసుకోవాలని చెప్పారు.