న్యూఢిల్లీ: ఓ కారు ఏకంగా ఫుట్ పాత్ మీద కూర్చున్న నలుగురు వ్యక్తుల మీదికి వెళ్లింది. ఈ ఘటన ఢిల్లీ లోని కశ్మీర్ గేట్ వద్ద జరిగింది. ఫుట్ పాత్ మీద కూర్చున వాళ్ల మీదికి కారు వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.