కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ రోగనిరోధకశక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజూ వేడినీళ్లు తాగడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేడినీళ్లు తాగడం ఒక్కసారి అలవాటు చేసుకున్నారంటే.. మీరు సాధారణ నీళ్లు తాగడానికి కూడా ఇష్టపడరు. రోగాలను దరి చేరనివ్వకుండా శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతాయి. మరి, వేడి నీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
-> కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులకు మంచి ఔషదం.
-> అధిక బరువు, ఊబకాయం సమస్యలనూ వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
-> మధుమేహం వస్తుందనే అనుమానం ఉంటే.. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
-> కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
-> దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారు గోరు వెచ్చని నీరు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
-> వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది.
-> గొంతు సమస్యలు దరి చేరవు. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa