భారత్ విద్యావిధానం మారబోతోంది. కరోనా నేపథ్యంలో సరికొత్తగా విద్యార్థులకు సౌకర్యవంతంగా ముందుకు రాబోతోంది. బుధవారం కొత్త జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల దగ్గర నుంచి ఎంఫిల్ డిస్ కంటిన్యుయేషన్ వరకు విద్యా విధానంలో మార్పులు చేశారు. నూతన విధానాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖర్గే మాట్లాడుతూ ఇప్పటి వరకు డీమ్డ్ యూనివర్శిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర యూనివర్శిటీలకు వివిధ నిబంధనలు ఉన్నాయి. అయితే, నాణ్యమైన విద్యను అందించే క్రమంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అన్ని విద్యా సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండబోతున్నాయని తెలిపారు. నూతన విద్యా విధానాలలోని కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త జాతీయ విద్యా విధానంలో కీలక అంశాలివే:
యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు.
ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట.
ఎంఫిల్ కోర్సులను నిలిపివేత
న్యాయ, వైద్య కళాశాలలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే రెగ్యులేటర్ కిందకు తీసుకురావడం.
యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు నూతన విద్యా విధానం ప్రకారం కామన్ ఎంట్రెస్ టెస్ట్
పాఠశాల పాఠ్యాంశాలను ప్రాధాన్యతా స్థాయికి తీసుకురావడం.
6వ తరగతి నుంచి ఒకేషనల్ విద్యతో అనుసంధానం చేయడం.
2035 నాటికి హైస్కూల్ విద్యార్థుల్లో 50 శాతం మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చేయడం.
జీడీపీలో 6 శాతాన్ని విద్యకు కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది.
ప్రస్తుతం జీడీపీలో 4 శాతాన్ని మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు.
విద్యా సంస్థల ఫీజులకు ఒక పరిమితిని విధించడం.
2030 నాటికి ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ లెవెల్ స్కూళ్ల వరకు 100 శాతం స్థూల నమోదు నిష్పత్తి ఉండేలా లక్ష్యం
ఐదో తరగతి వరకు మాతృ భాష కూడా ఒక మీడియంగా ఉండేలా నిర్ణయం
రిపోర్ట్ కార్డుల్లో మార్కులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలను పేర్కొనడం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa