ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరవరరావును కలిసేందుకు అనుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 29, 2020, 10:04 AM

భీమా కొరేగావ్‌ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విప్లవ రచయిత వరవరరావును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. వరవరరావు ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa