ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి 30వేల మందికి కరోనా వ్యాక్సిన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 28, 2020, 11:44 AM

30 వేల మందికి ట్రయల్స్‌లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా 150 కరోనా వ్యాక్సిన్లు తయారవుతుంటే వాటిలో అమెరికా నుంచి మోడెర్నా కంపెనీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ mRNA-1273 ఇప్పటి వరకూ రెండు దశల ట్రయల్స్‌లో బాగా పనిచేసింది. అందుకే మూడో దశలో అమెరికాలోని 70 చోట్ల 30 వేల మంది వాలంటీర్లపై మూడో ట్రయల్స్ ప్రారంభించింది. దీనికి కరోనా వైరస్ ఎఫికసీ స్టడీ (కోవే స్టడీ) అని పేరు పెట్టింది. ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్లపై ఇంత పెద్ద ట్రయల్స్ ఏ కంపెనీ కూడా చెయ్యలేదు.మూడో ట్రయల్స్‌లో ముందుగా జార్జియా రాష్ట్రంలోని సవానాకు చెందిన వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇదో ప్రత్యేకమైన ట్రయల్. ఎందుకంటే 30 వేల మందిలో అందరికీ mRNA-1273 వ్యాక్సిన్ ఇవ్వరు. కొందరికే ఇస్తారు. మిగతావారికి ప్లసీబో (సెలైన్‌ లేదా మరో వ్యాక్సిన్‌) ఇస్తారు. అంటే తమకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారో వాలంటీర్లకు తెలీదు. ప్రతి వారికీ 2 డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్లను గమనిస్తూ ఉంటారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు రోజూలాగే ఉండొచ్చు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన పనిలేదు. మోడెర్నా కంపెనీ అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ (ఎన్ఐఎఐడి)తో కలిసి పనిచేస్తోంది. అందువల్ల ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa