అమరావతి: వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరే కీలమని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నీరు-ప్రగతిపై కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించాలని సూచించారు. నీటి భద్రత కల్పిస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం కష్టం కాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,40,444 పంటకుంటల తవ్వకం పూర్తయిందన్నారు. ఏప్రిల్ నాటికి 4 లక్షల పంటకుంటల తవ్వకం పూర్తి చేయాలని ఆదేశించారు.