ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దొర్నిపాడు మండలంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు ట్రాన్స్ కో ఏఈ రామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాకరాజువేముల ఫీడర్ పరిధిలో బుర్రారెడ్డిపల్లె, చాకరాజువేముల, వెంకటేశ్వరనగర్ గ్రామాలున్నాయన్నారు.అలాగే డబ్ల్యూ.కొత్తపల్లె ఫీడర్ పరిధిలో డబ్ల్యూ. గోవిందిన్నె, డబ్ల్యూ.కొత్తపల్లి గ్రామాలకు, భాగ్యనగరం ఫీడర్ పరిధిలో కొండాపురం, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం, భాగ్యనగరం, రామచంద్రాపురం గ్రామాలకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒకే విడతలో 9 గంటల ఉచిత త్రీఫేస్ విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు. మారిన వేళలను రైతులు గమనించాలని కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa