ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా భయంతో ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 27, 2020, 05:51 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన షఫీ గత కొంతకాలంగా కార్పెంటర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆత్మకూరు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడం, తనకు కరోనా సోకిందేమో అనే అనుమానం తో ఈ నెల 22న టెస్ట్ చేయించుకున్నడు.రిపోర్ట్ లో ఎక్కడ పాజిటివ్ వస్తుందోనన్న భయంతో అటు నుంచి ఆటే వెళ్ళిపోయి నాలుగు రోజుల తరువాత పట్టణ శివార్లలోని డిగ్రీ కళాశాల సమీపం లోని ఓ పాడుబడ్డ బావిలో శవమై తేలాడు. అదే రోజు తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa