విశాఖ మన్యంలో గత 10 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకోంది. 9 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి...! ఓ రకంగా ఇప్పుడు అక్కడ అప్రకటిత రెడ్ అలర్ట్ తో నివురుగప్పిన నిప్పులా ఓ యుద్ద వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు.ఈ పరిస్థితి ఏర్పడటానికి అసలు కారణం ఏంటంటే... మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. వారోత్సవాలను అడ్డుకునేందుకు సాయుధ దళాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.దీంతో మన్యంలో వరుసగా తుపాకుల మోత మోగుతోంది. ఆంధ్రా, ఒరిస్పా బార్డర్ లో రెండు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా, మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు భగ్నం చేయాలని పోలీసులు..... ఎలాగైనా వారోత్సవాలు జరిపి తమ ఉనికిని చాటుకోవాలన్న పట్టుదలతో మావోయిస్టుల ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఏవోబి ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa