ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాంబు పేలుడు కేసులో నేరస్తుడికి బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 12:14 PM

న్యూఢిల్లీ : లజ్‌పత్‌నగర్‌లో బాంబు పేలుళ్ల కేసులో నేరస్తుడు మొహ్మద్‌ నౌషాద్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 1996లో లజ్‌పత్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడి పలువురి మరణానికి కారకుడైన మొహ్మద్‌ నౌషాద్‌ తన కుటుంబంలో ఈ నెల 26న జరిగే ఒక వివాహానికి హాజరు కావడానికి బెయిల్‌ మంజూరు చేయాలని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బాంబు పేలుళ్ల ద్వారా పలువురి మరణాలకు కారణమైన వ్యక్తులకు కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడానికి బెయిల్‌, పెరోల్‌ వంటివి ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com