నంద్యాల డివిజన్ పరిధిలోని రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్ రావడంతో కర్నూలు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించారు. ఆమె ఈ నెల 18న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం నివేదిక రావడంతో అందులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యాధికారులు అంబులెన్సు ద్వారా కర్నూలుకు తరలిస్తుండగా నంద్యాల సమీపంలో ఆ గర్భిణికి నొప్పులు రావడంతో అందులోనే ఆడశిశువుకు జన్మనిచ్చారు.వెంటనే ఆమెను 108 సిబ్బంది నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించిన 108 వాహనం టెక్నీషియన్ జీవన్, పైలట్ గురుస్వామిని వైద్యులు అభినందించారు. 18న కరోనా పరీక్ష చేయించుకోగా నివేదిక ఆలస్యంగా రావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె బంధువులు ఆరోపించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa