ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమాతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కోవిడ్-19పై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 26, 2020, 10:33 AM

అంతర్జాతీయ సంస్థ యునిసిఫ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జమాఆతె ఇస్లామీ హింద్ ఏపీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొవిడ్-19 పై రాష్ట్రంలో జులై 25 నుండి ఆగస్టు 10వరకు పక్షం రోజులు నిర్వహించే కార్యక్రమాలు జమాత్ కార్యాలయంలో యూనిట్ అధ్యక్షులు సి.యం.జకరియా, సంఘసేవ కార్యదర్శి అబ్దుల్ సమద్, హాఫీజ్ సోయబ్ జమా, మోమిన్ గౌస్, సలీం, ఫయాజ్, సద్దాం లాంఛనంగా ప్రకటించారు.ఈ సందర్భంగా సమద్, జకరియా మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాధి నిర్మూలన, అవగాహన తదితర అంశాలపై జమాఆతె ఇస్లామీ ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో పని చేస్తుందని, కరపత్రాల ద్వారా, ప్రచారం ద్వారా, ఆటోలలో ప్రకటనలద్వారా, చిరు నాటకాలు ద్వారా ప్రజల్లో అవగాహన కల్గించటం చేస్తుందన్నారు.రెడ్ జోన్ ల్లో మున్సిపల్ వలంటిర్లకు సహాయ సహకారాలు అందివ్వటం, సీజనల్ వ్యాధులకు హోమియో మందుల పంపిణీ, అసుపత్రుల వద్ద సహయం వివిధ రూపాల్లో నిర్వహించనున్నట్లు జకరియా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa