ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక చవితి నియమ నిబంధనలివే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 26, 2020, 10:30 AM

ఆగస్టు 22న జరిగే వినాయక చవితి ఉత్సవాలపై వినాయక కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా వైరస్ మానవాళిపై విజృంభిస్తున నేపథ్యంలో 2020వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎవరిఇళ్లలో వాళ్లు జరుపుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం ప్రధాన కూడళ్లలో, రోడ్లపైన,వీధులలో వినాయక విగ్రహాలను కూర్చోపెట్టారాదని పేర్కొన్నారు.పట్టణంలో ఉన్న ఆయా దేవాలయాలలో కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను కూర్చోపెడుతున్నా విషయం అందరికి తెలిసిందే.. అలాంటి దేవాలయాలలో యధావిధిగా విగ్రహాలను కుర్చోపెట్టవచ్చని,పూజా కార్యక్రమాలకు కేవలం పూజారి మాత్రమే నిర్వహించాలని అన్నారు.దేవాలయ సమయంలో మాత్రమే వినాయక విగ్రహాన్ని భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని, నిమజ్జనం రోజు దేవాలయం దగ్గర అన్నదానం నిర్వహించరాదని తెలిపారు.బహిరంగంగా వినాయక విగ్రహాలను కూర్చోపెట్టరాదు. వినాయక నిమజ్జనం రోజు వినాయక విగ్రహంతో పాటు కేవలం 10 మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ మేళతాళలతో ఊరేగింపు గా వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేసిరావాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వినాయక కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa