ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో కరోనా విశ్వరూపం... తాజాగా 904 మందికి సోకిన మహమ్మారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 24, 2020, 12:15 PM

కర్నూలులో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గలేదు. నానాటికీ పెరుగుతూనే ఉంది. పట్టణాలకే పరిమితమైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో 904 మందికి కరోనా పాజిటివ్ సోకింది. మరణాలు కూడా జిల్లాలో మరో ఏడుగురు మరణించారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం బులెటిన్ లో పేర్కొంది. ఈ పాజిటివ్ కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8701కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య కూడా 142కు పెరిగాయి. జిల్లాలో వ్యాప్తంగా వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 3480 మంది చికిత్స పొందుతుంటే.... ఇప్పటికే కోలుకుని ఇళ్లకు చేరుకున్న బాధితుల సంఖ్య 5079కు చేరుకున్నాయి.ఇకపోతే కరోనా జిల్లా అంతటా విజృంభిస్తోంది. కొత్త ప్రాంతాలకు కూడా కరోనా వ్యాప్తిస్తుంది. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. కరోనా నివారణకు అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించగా.. మరికొన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa