ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎన్‌ఎంను అడ్డుకోవడంతో.. రాత్రంతా వర్షంలోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 24, 2020, 11:57 AM

కరోనా భయం మానవత్వాన్ని మాయంచేస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. ఏఎన్ఎంకు భర్తకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను గ్రామస్తులు ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆ ఏఎన్ఎం రాత్రంతా వర్షంలోనే ఉండిపోయారు. బుర్రిలంకకు చెందిన మహిళ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఇటీవల కరోనా బారిన పడటంతో అతడిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.దీంతో ఏఎన్‌ఎం కారణంగా తమకు సైతం కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఆమెను ఇంటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. ఈ విషయం గురించి బాధిత ఏఎన్‌ఎం మాట్లాడుతూ.. సొంత ఇంట్లోకి తనను అడుగుపెట్టనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గ్రామానికి సేవ చేసినందుకు ఫలితం ఇదేనా అంటూ వాపోయారు. కరోనా మహమ్మారిపై మొదటి వరసలో ఉండి పోరాడుతున్న వారికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు తప్పడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa