చాలా రోజుల తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా జనసేనాని పవన్ కళ్యాన్ ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కార్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రపంచానికి వచ్చిన విపత్తుగా జనసేనాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉంటే తీవ్రతను తగ్గించొచ్చని.. ఏపీ ప్రభుత్వం కూడా ఇది ఫ్లూ వంటిదని వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రెండు నెలల లాక్డౌన్ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదని, లాక్డౌన్ తర్వాత కేసులు పెరిగాయని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉంటే బావుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. టెస్టుల విషయంలో బాగా చేశారని తాను ట్వీట్ చేశానని, కానీ టెస్టుల తర్వాత రోగులు ఆస్పత్రులకు వెళితే, ఆహారం సరిగా లేదు.. ఇంట్లోనే ఉండమని చెబుతున్నారనే విమర్శలు వస్తున్నాయన్నారు.ఏపీ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా లేదని క్షేత్రస్థాయిలో చెబుతున్నారని.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి..ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో ప్రజల్ని మోసం చేసే విధానం ఉంటుందన్నారు పవన్. పదివేల మందికి ఇస్తామంటారు.. ఇచ్చేది వెయ్యిమందికి మాత్రమే అన్నారు.అసైన్డ్ భూముల్ని భయపెట్టి లాక్కుంటున్నారన్నారు. వారికి మరో చోట స్థలాలు ఇస్తున్నారన్నారు. ప్రైవేట్ భూమి కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయని.. ప్రభుత్వం నిజమైన లబ్దిదారులకు పట్టాలు ఇవ్వాలని జననేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa