ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రాష్ట్రంలో 14 రోజులు సంపూర్ణ లాక్‌డౌన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 23, 2020, 12:39 PM

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ ను ‌‌విధించనున్నాయి. ఇప్పటికే బీహార్ మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. మణిపూర్ సైతం ఇప్పుడు లాక్ డౌన్ విధించింది. మణిపూర్‌లో 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మణిపూర్‌లో ఇప్పటి వరకు 2,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1400 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు. ప్రస్తుతం మణిపూర్‌లో 615 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అయినప్పటికీ కేసులు పెరగకుండా సంపూర్ణ లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa