ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మెడిసిన్ పై మార్గదర్శకాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 21, 2020, 05:57 PM

ఏపీ సర్కార్ కరోనా రోగులకు మందుల వాడకం పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఇష్టారాజ్యంగా మందులను వాడవద్దని ఆస్పత్రులకు సూచించింది. బాధితులకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మందులు ఇవ్వాలని సర్కార్ ఆస్పత్రులను ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులు, కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు వైద్యమందించే ప్రైవేటు ఆస్పత్రులు ఈ మార్గదర్శకాలను అనుసరించి మందులు వాడాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మందులకు నిర్ణయించిన ధరను మాత్రమే తీసుకోవాలని ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.


 


సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.


 


సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రోం ఉన్న దశలో తోసిలిజుమాంబ్‌ ఇంజక్షన్‌ వాడాలని సూచించింది.


కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు ఫావిపిరావిర్‌ మాత్రలు ఇవ్వాలని స్పష్టం చేసింది.


 


వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వాలని మార్గదర్శకాల్లో సూచించింది.


 


సెప్సిస్‌ లేదా సెప్టిక్‌ షాక్‌ వంటి పరిస్థితుల్లో మెరొపెనం ఇంజక్షన్‌ను ఇవ్వాలని పేర్కొంది.


 


ఈ మందులకు ఐసీఎంఆర్‌ లేదా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు విధిగా ఉండాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ మేరకు ఎన్ని డోసులు ఇవ్వాలో అంతకే ఆరోగ్యశ్రీ చెల్లిస్తుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa