ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద అంటూ భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనిస్తుంది. మరి భక్తులు గోవింద నామస్మరణం చేయడం వెనుక పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం...గోకులంలో ఉండే ప్రజలంతా ఇంద్రుడిని పూజించడానికి సిద్ధం అవుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రునికి ఎలాంటి పూజలు చేయనవసరం లేదంటూ చెప్పడంతో గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించడం మానేశారు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులంపైన పిడుగులతో కూడిన భయంకర తుఫాన్ వచ్చేలా చేయడంతో గోకులంలో ఉన్న ప్రజలతో పాటు గోవులను కాపాడటం కోసం శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరి ఎత్తి పట్టుకొని రక్షించగా, అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకునేందుకు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక కామధేనువు వచ్చి తన బిడ్డలైన గోవుల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని పాలతో అభిషేకిస్తుంది. ఆ సుందర దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు పరవశించిపోయి ఇలా అంటాడు. నేను దేవతలకి మాత్రమే అధిపతిని కానీ నీవు గోవులకి కూడా అధిపతివి కనుక ఇప్పటినుండి మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు అని ఇంద్రుడు అంటాడు. ఈవిధంగా అప్పటినుండి ఆ భగవానుడు గోవింద నామంతో పూజలని అందుకుంటున్నాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa