ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 21, 2020, 10:15 AM

బీసీ ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు పై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన కులాల (బీసీ) కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను ఈ నెలాఖరు కల్లా భర్తీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బీసీల కోసం కొత్తగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. ప్రతి కార్పొరేషన్‌లో 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండనున్నారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. దీంతో 139 బీసీ కులాలు కార్పొరేషన్ల పరిధిలోకి రానున్నాయి. బీసీల అభ్యున్నతి కోసం వైసీపీ ప్రభుత్వం చేసినట్టు గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa