ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నియోజకవర్గంలో జులై 30వ తేదీ వరకు లాక్ డౌన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 19, 2020, 05:24 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పట్టణంలో జులై 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు పెట్టిన వారం లాక్ డౌన్ ఆదివారంతో ముగుస్తున్న తరుణంలో రోజురోజుకు కేసులు నమోదు అవుతున్నాయి అని కేసులు కట్టడి కోసం జులై 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.కేవలం నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రమే ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు అనుమతి అని వారు కూడా శానిటేజర్ వాడుతూ... సామాజిక దూరం పాటిస్తూ మస్కులు ధరించే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఎవరు అనవసరంగా రోడ్లపైకి రాకుండా అత్యవసరం ఉంటే మాస్కులు ధరించి బయటకు రావాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa