కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు, తహశీల్దార్ విద్యాసాగర్, సిఐ కేశవరెడ్డి, ఎంపిడిఓ అశ్వనీ కుమార్, డాక్టర్ శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయం నందు నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన సమావేశమైన అధికారులు మండలంలో గత మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం 29 పాజిటివ్ కేసులకు చేరుకోవడంపై చర్చించారు.అనంతరం కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు పాలు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు మాస్కులు ధరించి బయటకు రావాలన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసర సరుకుల దుకాణాలతో పాటు పాలు, మాంసం దుకాణాలు తప్ప ఇతర దుకాణాలు తెరవకూడదు అన్నారు.బహిరంగ ప్రదేశాల్లో, నిషేధిత ప్రాంతాల్లో ప్రజల గుంపులు గుంపులు ఉండకూడదని, అలాగే మద్యం, గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారికి మొదటి సారిగా 200 రూపాయలు, రెండో సారి 500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, అలాగే నిబంధనలు పాటించని వారు పబ్లిక్ హెల్త్ 1939 ఎపి మున్సిపల్ చట్టం1965 ప్రకారం జరిమానాతో పాటు శిక్షార్హులే అని వారు తెలిపారు. ఈ నిబంధనలు మండలం మొత్తానికి వర్తిస్తాయని వారు తెలిపారు. అయితే ఉన్నఫలంగా శుక్రవారమే లాక్ డౌన్ అమల్లోకి తేవడంతో హోటళ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa