ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ కేసులో రవిప్రకాష్ కు ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 17, 2020, 06:45 PM

ఈడీ కేసులో టీవీ9 రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో రవి ప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రవి ప్రకాష్ ను అరెస్టు చేయడానికి వీలు లేదని కోర్టు అభిప్రాయపడింది. గతంలో ఓ సంస్థలో రవిప్రకాష్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు రూ.18 కోట్ల నిధులు అనుమతి లేకుండా తీసుకున్నారని సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు 2019 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ నమోదు చేశాయి. ప్రతి శనివారం ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు రవిప్రకాష్ ను ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఈడీ హైకోర్టుకు అనుమతిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa