కర్నూలు జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళన కలకలం రేపుతోంది. సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపిస్తూ ఆమె జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ సీఐపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఐ తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. ఇదే అంశంపై ఈనెల 15న జిల్లా ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ ఫకీరప్ప విచారణకు ఆదేశించారు.అయితే కేసు విచారణలో ఉండగానే సీఐ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసనకు దిగింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. సీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటుంది. తాను తన కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్నానని ఇదే అదనుగా భావించి సీఐ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తన వద్ద సీఐ అనేక సార్లు డబ్బులు సైతం తీసుకున్నట్లు ఆరోపించింది. ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. తనను, తన కుమారుడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంటుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa