ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పట్టణాల్లో సంపూర్ణ లాక్ డౌన్...పూర్తి వివరాలు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 17, 2020, 06:32 PM

కర్నూలు జిల్లాలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. జిల్లాపై పగబట్టిన కరోనా భారీ సంఖ్యలో ప్రజలను మంచాన పడేస్తోంది. మహమ్మారి సోకి ఇప్పటికే 4816 మంది బాధపడుతుండగా 114 మంది బలయ్యారు. ఇకపోతే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 4816 కేసులలో అత్యధికంగా 1559కుపైగా కేసులు కర్నూలు నగరంలోనే నమోదు కావడం కలకలం రేపుతోంది. కర్నూలు నగరంలో ఒకేరోజు 128 కేసులు వెలుగు చూశాయి. దీంతో బాధితుల సంఖ్య 1559కు చేరింది. వీటిలో 621 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 887 మంది డిశ్చార్జి అయ్యారు. బుధవారపేటలో 31 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. .దీంతో కాలనీలో రెండు రోజుల్లో 47 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అబ్బాస్‌ నగర్‌-5 విజయలక్ష్మినగర్‌-5, దేవనగర్‌-4, వెంకటాద్రినగర్‌-3, కృష్ణానగర్‌-3, లక్ష్మీనగర్‌-3, సిండికేట్‌ బ్యాంక్‌ కాలనీ-3, గణేష్‌నగర్‌-2, న్యూ క్రిష్ణానగర్‌-2, ప్రకాష్‌ నగర్‌-2, రెవెన్యూ కాలనీ-2, షరీఫ్‌ నగర్‌-2, వాసవి నగర్‌-2 కేసులు వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కకేసు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కర్నూలు నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.కరోనా కట్టడికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో కఠిన ఆంక్షలు విధించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం తప్పడం లేదన్నారు. మరణాలు సైతం నగరంలో భారీగానే నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అదుపు చేసేందుకు ఆంక్షలు మరింత కఠినం చేయనున్నట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు విధిస్తే కరోనా మహమ్మారిని అరికట్ట వచ్చునని వారు అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో శుక్రవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు కమిషనర్‌ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పాలు, కిరాణం, మాంసం దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు. ఈ సమయంలో తప్పకుండా భౌతిక దూరం పాటించేలా దుకాణదారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు విస్మరించినట్లు గుర్తిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. నగరంలో వాహనాలు, జనసంచారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కరోనా కేసులు తగ్గేవరకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.ఇకపోతే కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో ఆంక్షలు కఠినమైతే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.కోడుమూరు,నంద్యాల,ఎమ్మిగనూరు, ఆత్మకూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే కర్నూలు నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూనే కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa