ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ వాడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 17, 2020, 06:02 PM

ఓ బాలుడు అదేపనిగా మొబైల్ చూడటంతో తల్లి మందలించింది. ఫోన్ ఇవ్వకుండా దూరం పెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు గ్రామీణ మండలంలోని పెద్దచెరుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వనలక్ష్మి దంపతుల కుమారుడు వెంకట ప్రణీత్‌ గోవింద్‌ వయసు 13 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. స్మార్ట్‌ ఫోనుకు అలవాటు పడిన గోవింద్‌ నిత్యం అదే పనిగా దాన్నే చూస్తున్నాడు.స్కూల్స్ కూడా బంద్ కావడంతో గోవింద్‌కు సెల్ ఫోన్‌ బాగా అలవాటు అయిపోయింది. దీంతో రోజు మాదిరిగానే మంగళవారం ఫోను కావాలని తల్లిని అడిగాడు. అయితే ఆమె మందలించి ఫోను ఇవ్వకుండా కుమార్తెతో కలిసి పక్కింటికి వెళ్లింది. ఫోను ఇవ్వలేదని మనస్తాపం చెందిన గోవింద్‌ బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తల్లి అడిగినా ఫోన్ ఇవ్వలేదన్న మనస్తాపంతో చీరతో రేకులకు ఉన్న ఇనుప గొట్టానికి ఉరి వేసుకున్నాడు. విషయం తెలిసి బాలుడిని నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి తల్లిడిల్లిన తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa