కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకమని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నైపుణ్యం అనేది మనకు మనమే స్వయంగా అలవరచుకొని వృద్ధి చేసుకునేదని చెప్పారు. అది మన కాళ్లపై మనల్ని నిలబడేట్టు (స్వావలంబన) చేయడమే కాకుండా మన తోటివారికి కూడా ఉపాధి కల్పిస్తుందన్నారు. ‘వరల్డ్ యూత్ స్కిల్ డే’ సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం దేశంలోని యువతీ యువకులకు వీడియో ద్వారా తన సందేశాన్నిచ్చారు.ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ‘స్కిల్, రీ-స్కిల్, అప్స్కిల్’ చాలా అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. వాటికి అర్థాన్ని కూడా వివరించారు. స్కిల్ అంటే నైపుణ్యాలను సాధించడం, రీ-స్కిల్ అంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, అప్స్కిల్ అంటే ఆ నైపుణ్యాలను ఇతరులకు నేర్పించడమని వివరించారు. ఈ మూడూ ఎంతో కీలకమని, ఇదే యువతకు ఉపాధి మంత్రమని పేర్కొన్నారు. యువతను నైపుణ్యమున్న కార్మిక శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్కిల్ ఇండియా మిషన్’ను ప్రారంభించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దీని ద్వారా గత ఐదేళ్లలో సుమారు 5 కోట్ల మంది యువత వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa