ఏపీ సర్కార్ మరో నూతన అధ్యయనానికి నేడు శ్రీకారం చుట్టింది. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం కిందికి తెస్తామని సీఎం జగన్ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా గతంలో తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.తాజాగా నేటి నుంచి 6 జిల్లాల్లో అమలు చేయనున్నారు. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వేదికగా దీనిని ప్రారంభించారు. దీంతో ఇక ఈ జిల్లాలలో ప్రజల వైద్యానికి అయ్యే ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద చెల్లించనున్నారు. అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని సీఎం జగన్ వెల్లడించారు. త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింప చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa