ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగదుతో పట్టుబడ్డ ఏపీ మంత్రి కారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 16, 2020, 01:14 PM

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ తో ఉన్న కారు తమిళనాడులో నగదుతో పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా కారు పట్టుబడింది. ఆ కారులో రూ.4 కోట్ల నగదు,కొంత బంగారం లభించింది. కారు ఒంగోలు నుంచి వస్తునట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏపీ విద్యుత్,అటవీ,పర్యావరణం,సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు.కారు పట్టబడడం పై మంత్రి బాలినేని స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “పట్టుబడిన కారుకు తనకు సంబంధం లేదు. ఆ డబ్బు కూడా తనది కాదు. ఆ కారు మీద ఉన్న స్టిక్కర్ జీరాక్స్ తీసి అంటించారు. ఆ కారు తమిళనాడు రిజిష్టర్ తో ఉంది. పోలీసులు,మీడియా అసలు దొంగలు ఎవరో బయటపెట్టాలి.” అని అన్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa