కర్నూలు జిల్లాలో రోజురోజుకు కరోన్ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. కాగా కరోనాతో మరణించే వారి సంఖ్య కర్నూలులో ఎక్కువగా ఉంది. ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో 408 మంది కరోనాతో మంది మృతి చెందగా, ఒక్క కర్నూలులోనే 108 మంది మృత్యువాత పడ్డారు. మరణాల్లో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమంగా కర్నూలు నిలిచింది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారితోపాటు కొందరు యువత సైతం వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.జిల్లాలో మూడు కొవిడ్ ఆసుపత్రులున్నాయి. చికిత్స పొందుతూ చనిపోయినవారి మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా నగరానికి దూరంగా ఖననం చేస్తున్నారు. అంత్యక్రియల తర్వాత చేసే దశదిన కార్యక్రమాలకు వెనుకంజ వేస్తున్నారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలంటే బ్రాహ్మణులు సైతం రావడం లేదు. ఇతర సామాజిక వర్గాల్లోనూ ఆచారాలను పాటించలేని పరిస్థితి ఏర్పడింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa