ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: తహసీల్దార్ కార్యాలయానికి తాకిన కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 15, 2020, 11:55 AM

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో తహసిల్దార్ కార్యాలయం ఉద్యోగితో పాటు మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు బేతంచెర్లలో విఆర్ఓగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే బేతంచెర్ల పట్టణంలో నాల్గవ వార్డులో నివాసముంటున్న ఓ వ్యక్తికి, మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామంలోని 8వ వార్డులో తండ్రి, కొడుకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa