ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 15, 2020, 11:42 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా కరోనా వైరస్ బారినపడి మృతి చెందితే వారి అంత్యక్రియలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా బారినపడి మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ 19 నివారణ చర్యలపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa