ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 5 వేల ఈఎంఐతో కారు కొనండిలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 15, 2020, 11:37 AM

కరోనా విజృంభిస్తుండడంతో ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంటేనే భయపడుతున్నారు. దీంతో సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్త బైకులు, కార్లను కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లే అటు కార్ల కంపెనీలు, ఇటు బ్యాంకులు అనేక రాయితీలు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి, దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. రూ. 5000 కన్నా తక్కువ ఈఎంఐతో మారుతి కారును ఎలా కొనుగోలు చేయొచ్చో తెలుసుకుందాం. మారుతి ఆల్టో 800 ధర 2.94 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.అతి తక్కువ ధర కలిగిన మోడల్ మారుతి ఆల్టో 800 ఎస్‌టిడి, ఇక ఇందులోనే అత్యధిక ధర కలిగిన మోడల్ మారుతి ఆల్టో 800 ఎల్‌ఎక్స్ఐ సీఎన్‌జీ మోడల్. దీని ధర రూ. 4.36 లక్షలుగా ఉంది. హైదరాబాద్ లో మారుతి ఆల్టో 800 పెట్రోల్ లేదా బేస్ మోడల్ తీసుకుంటే, మీరు దానిని సుమారు 3.27 లక్షల రూపాయలకు పొందవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, మీరు sbi నుంచి రూ. 3 లక్షల రుణం తీసుకోవచ్చు. ఇందుకు ప్రస్తుతం బ్యాంకు 8 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. 7 సంవత్సరాలు అంటే 84 నెలల్లో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఈఎంఐ రూ .4,676 చెల్లించాల్సి ఉంటుంది. మీరు రూ. 5 లక్షల రూపాయల విలువైన కారు కొనాలనుకుంటే, 7 సంవత్సరాల పాటు రూ. 7,793ను ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa