కర్నూలు జిల్లాలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. జిల్లాపై పగబట్టిన కరోనా భారీ సంఖ్యలో ప్రజలను మంచాన పడేస్తోంది. మహమ్మారి సోకి ఇప్పటికే 3405 మంది బాధపడుతుండగా 101 మంది బలయ్యారు. ఇకపోతే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 3405 కేసులలో అత్యధికంగా 1230 కేసులు కర్నూలు నగరంలోనే నమోదు కావడం కలకలం రేపుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అమలు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా కట్టడికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఇక మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తప్ప మరో ప్రత్యామ్నాయం తప్పడం లేదు. మరణాలు సైతం నగరంలో భారీగానే నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అదుపు చేసేందుకు లాక్ డౌన్ అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు విధిస్తే కరోనా మహమ్మారిని అరికట్ట వచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa