ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాలకు అడ్డాగా "ఓఎల్‌ఎక్స్"‌!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 14, 2020, 05:22 PM

కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలకు గురవుతున్న ఓఎల్‌ఎక్స్‌పై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఓఎల్‌ఎక్స్‌ వల్ల ఇప్పటికే అనేక మంది ప్రజలు సైబర్ నేరాలకు గురయ్యారని చాలా డబ్బు నష్టపోయారని పోలీసులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ ఓఎల్‌ఎక్స్‌పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో ఓఎల్‌ఎక్స్‌లో కొనుగోలు, అమ్మకాలు జరపొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ను ఆసరా చేసుకుని ప్రజలు డబ్బులను లాగేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌ వెబ్ సైట్‌ను నిషేధించాలని కోరతామని పోలీసులు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa