ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో కరోనా మారణ హోమం: సెంచరీకి దగ్గర్లో మరణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 07:30 PM

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో తిష్టవేసుకుని కూర్చున్న మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. ఇప్పటికే అనేకమందిని మంచాన పడేసిన రక్కసి తాజాగా మరో నలుగురిని బలితీసుకుంది. దాంతో జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 97కి చేరుకున్నాయి. ఇకపోతే జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు.లాక్ డౌన్ సడలింపులు తర్వాత ఈ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకప్పుడు ఢిల్లీ లింకులు..ఆ తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ లింకులు...తాజాగా కువైట్ లింకులు ఇలా కరోనా వైరస్ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో 309 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 17 మంది మృత్యువాత పడ్డారు.కర్నూలు జిల్లాలో నలుగురు..గుంటూరు జిల్లాలో ముగ్గురు..విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు.. నెల్లూరు జిల్లాలో ఇద్దరు..అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 97 మంది కరోనాకు బలవ్వగా ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 77 మంది చనిపోయారు. దాంతో కరోనా మరణాలలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఒకవైపు ప్రతీ రోజూ డబుల్ డిజిట్ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటం....మరోవైపు మృతులు కూడా అలాగే పెరుగుతుండటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa