ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి సహసానికి సోషల్ మీడియా సలాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 07:19 PM

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే జంట చూపిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. 20 కత్తి పోట్లు ఒంటిపై ఉన్నా ఏ మాత్రం భయపడకుండా దొంగలను పరిగెత్తించిన వీరి ధైర్యం అభినందనలు అందుకుంటోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట జాతీయ రహదారిపై చిక్‌మంగళూరుకు వెళుతుంది. రోడ్డు పక్కనే ఓ జంటను దొంగలు దోచుకుంటుండగా వారిని కాపాడేందుకు వీరు కేకలు వేశారు.దీంతో దోపిడీ దొంగలు వీరు ప్రయాణిస్తున్న కారును ద్విచక్ర వాహనంతో అడ్డగించారు. కారు నడుపుతున్న భర్తను దొంగలు కత్తితో 20 పోట్లు పొడిచారు. దీంతో అతడికి చేతులు, మొహం మీద దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. పక్కనే కూర్చుని ఉన్న భార్యకు ఏం జరుగుతుందో.. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న భార్య కారు ఎక్సలేటర్‌ను బలంగా తొక్కి పట్టి కారును ఎదురుగా ఉన్న దోపిడి దొంగల ద్విచక్రవాహనాలపైకి పోనిచ్చింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa