ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో కరోనా మృత్యు పంజా.. జిల్లాలో ఎంతమంది చనిపోయారంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 10, 2020, 04:20 PM

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో తిష్టవేసుకుని కూర్చున్న మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. ఇప్పటికే అనేకమందిని మంచాన పడేసిన రక్కసి తాజాగా మరో ఆరుగురిని బలితీసుకుంది. దాంతో జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 93కి చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడంలోనే కాదు.. మరణాలలోనూ కర్నూలు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 93 మరణాలతో ఏపీలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదైన జిల్లాగా రికార్డు సృష్టించింది. ఇకపోతే జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు.లాక్ డౌన్ సడలింపులు తర్వాత ఈ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకప్పుడుఢిల్లీ లింకులు..ఆ తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ లింకులు...తాజాగా కువైట్ లింకులు ఇలా కరోనా వైరస్ జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో 292మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు.కర్నూలు జిల్లాలో ముగ్గురు ..కృష్ణా జిల్లాలో ఒక్కరు చనిపోయారు. రాష్ట్రంలోఅత్యధికంగా కృష్ణా 75..కర్నూలు జిల్లాలలో 93 మంది కరోనాకు బలయ్యారు. ఒకవైపు ప్రతీ రోజూ డబుల్ డిజిట్ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటం....మరోవైపు మృతులు కూడా అలాగే పెరుగుతుండటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa