మద్యపాన నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం విపరీతంగా పెంచడంతో అక్రమ మద్యం దందా జోరుగా సాగుతోంది. అక్రమ మద్య రవాణాను అడ్డుకోవడం జగన్ సర్కారుకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తూనే ఎక్సైజ్ చట్టంలో పలు సవరణలు చేశారు. తాజాగా సవరించిన ఎక్సైజ్ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి అనేక మార్లు ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడేలా చట్టాలను మరిత కఠినం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్థానంలో ఇక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రధాన పాత్ర పోషించనుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa