కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ నోటిఫికేషన్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది భారతీయ రైల్వే. పలు నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువును పొడిగిస్తోంది. ఈస్టర్న్ రైల్వే గతంలో 2792 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4న ముగిసింది. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు చేయడానికి మరో అవకాశం ఇస్తామని ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో జూన్ 25న దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 9 వరకు అప్లై చేయొచ్చు. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్షాప్లు, డివిజన్లలో మొత్తం 2792 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను www.rrcer.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 2792
హౌరా డివిజన్- 659
సీల్దా డివిజన్- 526మాల్దా డివిజన్- 101
అసన్సోల్ డివిజన్- 412
కాంచ్రపర డివిజన్- 206
లిలువా డివిజన్- 204
జమల్పూర్ డివిజన్- 684
రెండో విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 జూన్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 9 సాయంత్రం 6.30 గంటలు
విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు-15 నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు..
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa