ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 07:14 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో శుభవార్త చెప్పింది. ఎంసీఎల్ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో వడ్డీ 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గనుంది. దీంతో హోమ్ లోన్లపై వడ్డీ 5-10 శాతం తగ్గించుకునే అవకాశం ఉంది. ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వరుసగా 14వ సారి కావడం విశేషం. ఈ కొత్త వడ్డీ రేట్లు జూలై 10 నుంచి అమలులోకి రానున్నాయి. మూడు నెలల కాల వ్యవధిపై ఇకపై 6.65 శాతం వడ్డీ అమలులో ఉండనుంది. ఎంసీఎల్ఆర్ ఎంత తక్కువ ఉంటే కస్టమర్లకు హోమ్ లోన్ ఈఎంఐ అంత తగ్గుతుంది. లేదా టెన్యూర్ తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి వడ్డీ రేట్లను రీసెట్ చేయించాల్సి ఉంటుంది. ఏడాదికి ఓసారి బ్యాంకు వడ్డీ రేట్లను రీసెట్ చేస్తుంది. జూలై లేదా ఆగస్టులో రీసెట్ పీరియడ్ ఉన్న కస్టమర్లు వడ్డీ రేట్లను మార్చుకోవచ్చు. ఇక ఇప్పటికే ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్(EBR),రెపో లింక్డ్ లెండింగ్ రేట్(RLLR) తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. 6.95 శాతం వడ్డీకే హోమ్ లోన్స్ న ఎస్బీఐ అందిస్తోంది. జూలై 1 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. గత నెలలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్‌(EBR) రెపో లింక్డ్ లెండింగ్ రేట్-(RLLR)ను ఎస్‌బీఐ 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎస్‌బీఐలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్‌ 7.05 శాతం నుంచి 6.65 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ 6.65 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చాయి. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి 2019 సెప్టెంబర్ మధ్య తీసుకున్న హోమ్ లోన్లతో పాటు అన్ని రీటైల్ లోన్లు ఎంసీఎల్ఆర్‌కు అనుసంధానించబడి ఉంటాయి. 2019 అక్టోబర్ 1 నుంచి తీసుకున్న రుణాలన్నీ ఆర్ఎల్ఎల్ఆర్‌కు అనుసంధానించబడి ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa